Monday, October 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల కొండపై హెలికాఫ్టర్ చక్కర్లు.. భక్తులు ఆగ్రహం

Tirumala: తిరుమల కొండపై హెలికాఫ్టర్ చక్కర్లు.. భక్తులు ఆగ్రహం

Tirumala| హిందూవుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై హెలికాఫ్టర్(Helicopter) చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల కొండను నో ఫ్లైజోన్‌గా అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం తిరుమల కొండపై ఆకాశంలో ఎలాంటి విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరకూడదు. అయితే ఇటతీవల కాలంలో తరుచుగా కొండ మీదుగా విమానాలు, హెలికాఫర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో హెలికాఫ్టర్ తిరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు.

- Advertisement -

దీనిపై అప్రమత్తమైన టీటీడీ(TTD) అధికారులు ఈ హెలికాఫ్టర్ ఎలా వచ్చింది..? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల కొండపై ఎలా చక్కర్లు కొట్టిందనే దానిపై ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. కాగా గతంలో 2023 ఏప్రిల్ 25న కకూడా తిరుమల కొండపై విమానం చక్కర్లు కొట్టింది. ఈ విమానం గురించి ఆరా తీయగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంగా అధికారులు చెప్పారు. టెక్నాలజీ సమస్య కారణంగానే కొండపై ఎగిరిందని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News