Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Holagonda: అభివృద్ధి చేసి చూపిస్తా

Holagonda: అభివృద్ధి చేసి చూపిస్తా

విరూపాక్షి విస్తృత ప్రచారం

హొళగుంద మండలం సుళువాయి, మూగమానగుంది, ముద్దటామాగి, సమ్మతగేరి గ్రామాలలో ఆలూరు తాలూకా వైసిపి ఇన్చార్జ్ బూసునేని విరుపాక్షి పర్యటించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సుళువాయి గ్రామంలో వాల్మీకి విగ్రహాన్ని పెట్టిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని, చెరువు కట్ట కట్టించి సుళువాయి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేస్తానని సభాముఖంగా తెలిపారు. అనంతరం గ్రామాలలో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమం అభివృద్ధి నా ధ్యేయం మీరు 50 రోజులు కష్టపడండి నన్ను గెలిపిస్తే నేను ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తా, ప్రజా సమస్యలపై పోరాడుతా, అసెంబ్లీలో ఈ వెనుకబడిన ప్రాంతం గురించి నా గళం విప్పుతా అన్నారు.

- Advertisement -

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మీ ఇంటి బిడ్డగా భావించి నాకు మీ ఆశీస్సులు అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ,సుళువాయి సర్పంచ్,మండల కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News