Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Ahobilam: నరసింహ స్వామికి 101 టెంకాయలు కొట్టిన టిడిపి

Ahobilam: నరసింహ స్వామికి 101 టెంకాయలు కొట్టిన టిడిపి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి త్వరగా విడుదల కావాలని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు ఆలమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు బాచిపల్లెపత్తి నారాయణ, శెట్టి వేణు గోపాల్, నరసింహ, అహోబిలం టీడీపీ నాయకులు గూడూరు సంజీవరాయుడు, గంగాధర్, రాంబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో ఇటీవల నారా లోకేష్ బాబు పాదయాత్ర ప్రజలు తండోపతండాలుగా రావడం చూసి వైసీపీ నాయకులకు దిక్కుతోచక రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేశారని వారు ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టి వైసీపీని తరుముతారని వారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News