Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru politics: కొనసాగుతున్న మాచాని సోమనాథ్ ప్రచారం

Emmiganuru politics: కొనసాగుతున్న మాచాని సోమనాథ్ ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ప్రచారం

టిడిపి నాయకుడు డాక్టర్ సోమనాథ్ ప్రచారం కొనసాగుతోంది. స్థానిక కొండవీటి ప్రాంతం, బంగారు బజార్ లలో బాబు షురిటి భవిషత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని సూపర్ సిక్స్ పతకాలు ను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ టిడిపి మేనిఫెస్టోలోని మహిళల మహాశక్తి,యువగళం, రైతు భరోసా, ఇంటింటికీ త్రాగు నీటి కొలాయి, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ లపై అవగాహన కల్పించారు. జగన్ ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని సోమనాథ్ అన్నారు.

- Advertisement -

టిప్పు సుల్తాన్ యూత్ సభ్యులు టీడీపీలోకి..

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన టిప్పు సుల్తాన్ యూత్ అద్యక్షుడు జహంగీర్ తో మరో 50 మంది సభ్యులు టిడిపిలో చేరారు. స్థానిక మచాని సోమనాథ్ నివాసంలో టిడిపి నాయకులు డాక్టర్ సోమనాథ్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి డాక్టర్ సోమనాథ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ యూత్ చేసిన సేవలను భవిషత్తులో కొనసాగించాలని, మీకు మా సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం టిప్పు సుల్తాన్ యూత్ అద్యక్షుడు జహంగీర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరుకు మచాని సోమప్ప చేసిన సేవలను సోమనాథ్ కొనసాగిస్తారనే నమ్మకంతో టిడిపిలో చెరమన్నారు. టిడిపి బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టిడిపిలో చేరిన వారిలో యూత్ నాయకులు ఖలీల్,అహమ్మద్, రియాజ్, మస్తాఫా, సాగర్, అలీ,ఇలియాస్, అల్తాఫ్, మహబూబ్ తో పాటు మరికొంత మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News