Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagananna vidya deevena: తల్లుల ఖాతాల్లో 24.52 కోట్లు జమ

Jagananna vidya deevena: తల్లుల ఖాతాల్లో 24.52 కోట్లు జమ

జిల్లాలో 34,879 మంది విద్యార్థులకు లబ్ది

జగనన్న విద్యా దీవెన క్రింద ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబందించి 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రు. 24.52 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి బహిరంగ వేదిక నుంచి జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680.44 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జమ చేసే వర్చువల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా, సంక్షేమ శాఖ డిడి చింతామణి, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు తదితరులు వీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సామూన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబందించి 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రు. 24.52 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 5,981 మంది విద్యార్థుల తల్లులకు రు.4.16 కోట్లు, బనగానపల్లిలో 6,238 మంది విద్యార్థుల తల్లులకు రు.4.36 కోట్లు, డోన్ లో 5,002 మంది విద్యార్థుల తల్లులకు రు.3.39 కోట్లు, నందికొట్కూర్ లో 5,316 మంది విద్యార్థుల తల్లులకు రు.3.54 కోట్లు, నంద్యాలలో 5,896 మంది విద్యార్థుల తల్లులకు రు.4.60 కోట్లు, పాణ్యంలో 1,803 మంది విద్యార్థుల తల్లులకు రు.1.29 కోట్లు, శ్రీశైలంలో 4,643 మంది విద్యార్థుల తల్లులకు రు. 3.14 కోట్లు, వెరసి మొత్తం 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రు. 24.52 కోట్లు నేరుగా జమ చేశామని కలెక్టర్ వివరించారు.ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ హితబోధ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు….చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందాన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు తదితరుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News