Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: ప్రతి కార్యకర్తా ఓ సైనికుడే

Kalluru: ప్రతి కార్యకర్తా ఓ సైనికుడే

కర్నూలు పట్టణం దేవి ఫంక్షన్ హాల్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పాణ్యo నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు టీడీపీ ఇంచార్జి గౌరుచరిత రెడ్డి ఆధ్వర్యం లో RTS శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ఆర్టియస్ (RTS) ట్రైనర్ లు మదు సుధాకర్, సుహెల్ రానా, మహబూబ్ బాషా, పాణ్యo నియోజకవర్గ కల్లూరు అర్బన్,ఓర్వకల్లు,కల్లూరు, గడివేముల, పాణ్యo, మండలాల క్లస్టర్ ఇంచార్జి లు, యూనిట్ ఇంచార్జి లు, బి.ఎల్. ఏ.లు, మండలాల గ్రామ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరు చరితమ్మ మాట్లాడుతూ RTS శిక్షణలో విధి విధానాల గురించి తెలుసుకోవాలని,ప్రతి కార్యకర్త సైనికులు గా పని చేసి,వచ్చే 2024 ఎన్నికల్లో పాణ్యo నియోజకర్గo లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయలని,తెలుగుదేశం పార్టీ అధినేత నార చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అలాగే తెలుగుదేశo పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వచ్చే వారం లో పాణ్యo నియోజకర్గo లో కొనసాగుతుందని, ఈ పాదయాత్రను నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభిమానులు తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News