Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Krishnagiri: 'గడప గడపకు'లో ఎమ్మెల్యే

Krishnagiri: ‘గడప గడపకు’లో ఎమ్మెల్యే

95 శాతం హామీలు పూర్తి చేసిన ఏకైక సర్కారు జగన్ ప్రభుత్వమే

పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే నవరత్నాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని గడప గడపకు వెళ్లి వారి యొక్క సమస్యలను విని వారియొక్క సమస్యను ప్రభుత్వ అధికారులతో మమేకమై వెను వెంటనే వాటిని పరిష్కరిస్తూ , మునుముందుకు వెళ్తూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా
క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామ సచివాలయం పరిధిలోని తాపల కొత్తూరు, పులిచెర్ల గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈరోజు ఉదయం పాల్గొని జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలియజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేసిన ఏకంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఎంపీపీ, కటారుకొండ గ్రామపంచాయతీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రిష్ణగిరి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News