Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: ఫ్యామిలీ ప్యాకేజ్ తో ఎమ్మెల్యే శ్రీదేవి దోచుకుంటున్నారు

Lokesh: ఫ్యామిలీ ప్యాకేజ్ తో ఎమ్మెల్యే శ్రీదేవి దోచుకుంటున్నారు

పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవిపై నారా లోకేష్ విరుచుకు పడ్డారు. రాంపల్లి క్రాస్ రోడ్డు దగ్గర జరిగిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ పత్తికొండ శాసన సభ్యులు కంగాటి శ్రీదేవి ఫ్యామిలీ ప్యాకేజ్ తో ముందుకెళ్తుందన్నారన్నారు. అంగన్వాడి పోస్టుల్లో కూడా వదిలి పెట్టడం లేదన్నారు. ఇసుక, మట్టి, లిక్కర్ తో దోచుకుంటున్నారని, కేవలం ఎమ్మెల్యే సామాజిక వర్గానికి మాత్రమే పనులు చేస్తున్నారని ఆయన ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో చాలామంది రైతులు సాగు నీరు కోసం ఏర్పాటుచేసిన ఏకైక హంద్రీ నివా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నుండి తుగ్గలి మండలంలోని అన్ని చెరువులకు నీటిని నింపుతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంతవరకు నీటిని నింపిందే లేదన్నారు. క్రిష్ణగిరి వెల్తుర్తి తదితర మండలాల నుండి ఇసుక బెంగళూరుకు తరలించి కోట్లు దోచుకుంటున్నారన్నారు. బెంగళూరు నుండి టిప్పర్ల ద్వారా కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చుకుండా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

తమ ప్రభుత్వం వస్తే పత్తికొండలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. హంద్రీనీవా నుండి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు కచ్చితంగా అందిస్తామని ఏ ఒక్క రైతు కూడా వర్షం మీద ఆధారపడకుండా సాగు చేసుకోవడానికి వీలుగా చెరువులన్నిటికీ నీటిని నింపుతామన్నారు. శాసనసభ్యులు శ్రీదేవి నాలుగు సంవత్సరాలయిన హంద్రీ నీవా నుండి ఒక్క చుక్క నీరు కూడా అందించిన పాపానా పోలేదన్నారు. తమ ప్రభుత్వం వస్తే పత్తికొండ శసశ్యామలంగా చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కేఈ ప్రభాకర్, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షులు సోముశెట్టీ వెంకటేశ్వర్లు, బత్తిన వెంకటరాముడు, వెంకటపతి, తిరుపాలు నాయుడు, మాజీ ఎంపీపీ వెంకటేశు, బిటి నాయుడు, పరిటాల శ్రీరాములు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News