Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: మాది కార్యకర్తల పార్టీ, జగన్ ది దొంగల పార్టీ

Lokesh: మాది కార్యకర్తల పార్టీ, జగన్ ది దొంగల పార్టీ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు, ఆత్మకూరు పట్టణ శివారులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఎక్కడ చూసినా జనం నిండిపోయారు. అడుగడుగునా నారా లోకేష్ కు, మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కి జనం నీరాజనాలు పలికారు. ఆత్మకూరు పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు సత్తా చాటారని లోకేష్ మెచ్చుకున్నారు. బహిరంగ సభలో ఒకానొక దశలో కార్యకర్తలు పాటకు స్టెప్పులు వేసి హుషారుతించారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, జగన్ రెడ్డిది దొంగలు డకాయిట్ల పార్టీ అని, జగన్ ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని, 2024 ఎన్నికల్లో ఏ వన్ జగన్ జెండా పీకేయడం ఖాయమని, బహిరంగ సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే వైసీపీ నాయకులకు దడ పుడుతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 98వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగింది. ఆత్మకూరు పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ పోలీసులను పంపితే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తగ్గేదేలేదు అని చెప్పాను. ఇప్పుడు గొడవలు చెయ్యమని వైసిపి కుక్కల్ని పంపుతున్నాడు. బ్రదర్ బీ కేర్ ఫుల్ భయం మా బయోడేటాలో లేదన్నారు.సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని ఎవడైనా పాదయాత్ర అడ్డుకుంటాం అంటూ ఎగేసుకొని వస్తే తోలువలుస్తాం అంటూ లోకేష్ ప్రసంగం సాగి, టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News