Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్జనసేనను రౌడీసేన అన్నది అందుకేనా జగన్ గారూ ?: నాదెండ్ల మనోహర్

జనసేనను రౌడీసేన అన్నది అందుకేనా జగన్ గారూ ?: నాదెండ్ల మనోహర్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన అనంతరం.. ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. జనసేనను రౌడీ సేనగా విమర్శించారు. ఈ విమర్శలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. జనసేన ఎందుకు రౌడీసేన? అని సీఎం జగన్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తుచేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? జనసేన ఎందుకు రౌడీసేన? అని నాదెండ్ల నిలదీశారు.

- Advertisement -

మీ అసమర్థత కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా? జనసేన ఎందుకు రౌడీ సేన జగన్ గారూ!” అంటూ నాదెండ్ల సీఎం జగన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రజలతో మమేకమవుతున్న జనసేన అధినేతను, జనసైనికులను, జనసేన వీరమహిళలను జనసేన పార్టీని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయంటూ వరుస ట్వీట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News