Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: నిలిచిపోయిన గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం

Nandikotkuru: నిలిచిపోయిన గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం

జగనన్న లేఔట్ లో నిర్మించిన గృహాలకు గృహప్రవేశాలు

జగనన్న లేఅవుట్ కాలనీల్లో నిరుపేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 44 వేల గృహాలు మంజూరు చేశామని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిరుపేదలందరికీ ఇళ్లు పథకం కింద ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్న ప్రధాన నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్లను పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజవర్గం, సామర్లకోటలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీ లేఔట్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమాన్ని నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్ లోని వైఎస్సార్ జగనన్న కాలనీ లేఔట్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లైవ్ ద్వారా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందం రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికొట్కూరు శాసనసభ్యులు తోగూర్ ఆర్థర్, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, నందికొట్కూర్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రమాదేవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అబ్దుల్ సుకూర్మియా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహాత్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటసుబ్బయ్య తదితర అధికారులు పాల్గొని వీక్షించారు.

- Advertisement -


గృహప్రవేశాలు ప్రారంభించిన అనంతరం అనంతరం జిల్లా ఇంచార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 322 వైయస్ జగనన్న లేఔట్లు, సొంత స్థలాలు కలిగిన 44 వేల మందికి గృహాలు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు 31 వేల గృహాలు లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి వైయస్సార్ జగనన్న లేఔట్ లో 526 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 209 గృహాలు పూర్తి చేసుకొన్న గృహాలకు గృహప్రవేశాలు ప్రారంభించామన్నారు. మిగిలిన గృహాలు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ ద్వారా 6.28 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సంబంధించి త్రాగునీటి సరఫరా కొరకు 67.5 లక్షలు, విద్యుద్దీకరణకు 80 లక్షలు, రహదారుల నిర్మాణానికి 25 లక్షలు, పైలాన్ కొరకు 50 వేల రూపాయలు, ఆర్చి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువుల సరకులను కూడా ఇక్కడే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పారిశుధ్య చర్యలపై ఫోకస్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. గతంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు పొందుతున్నారో అదే రీతిలో ఈ కాలనీలో కూడా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే అర్థర్ లు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తిండి, కూడు, గుడ్డ అత్యవసరమని ఇందులో భాగంగానే ప్రతి నిరుపేద కుటుంబానికి గృహాన్ని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లో 209 మంది గృహాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గృహ నిర్మాణాలే కాకుండా విద్యా, వైద్య ఇతర సంక్షేమ రంగాలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, తహసిల్దార్ రాజశేఖర్ బాబు, రూరల్ సీఐ విజయభాస్కర్, ఎస్సైలు ఎన్వి రమణ, వెంకటసుబ్బయ్య, మారుతి శంకర్, వివిధ శాఖల అధికారులు , మున్సిపల్ వైస్ చైర్మన్ హర్ష పోగు ప్రశాంతి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్స్ అబ్దుల్ గఫార్, కౌన్సిలర్స్ చిన్న రాజు, జాకీర్ హుస్సేన్,అబ్దుల్ రావుఫ్,షేక్ నాయబ్,హమీద్ మియా, చాంద్ బాషా, లాలు ప్రసాద్, మనపాడు అశోక్, వైసీపీ నాయకులు ఉస్మాన్ బేగ్, జబ్బార్, బ్రహ్మం, పేరుమల్ల జాన్, తమ్మడపల్లె విక్టర్, పైపాలెం ఈనాయాతుల్లా,బాలస్వామి,డాక్టర్ వనజ, రాజేశ్వరి, జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News