Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: తాము చేసిన అభివృద్ధి చూపిన నాయకుడు

Nandikotkuru: తాము చేసిన అభివృద్ధి చూపిన నాయకుడు

నందికొట్కూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో తమ వార్డుకు కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులు చేయించినట్టు కౌన్సిలర్ చాంద్ భాషా తెలిపారు. పట్టణంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డులో 5.43 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన అభివృద్ధి పనులను కౌన్సిలర్ చాంద్బాషా సందర్శించి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కృషితో చైర్మన్ సుధాకర్ రెడ్డి సహకారంతో ప్రజలకు అందుబాటులో 81 లక్షలతో డాక్టర్ వైయస్సార్ హెల్త్ సెంటర్,2.06 కోట్లతో మంచినీటి ట్యాంక్, ఒక కోటి 19 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణం ఇలాంటి అభివృద్ధి పనులను చేపట్టినట్టు వివరించారు. తమ వార్డులో ప్రజలకు అవసరమైన త్రాగునీరు రోడ్లు, హెల్త్ కేర్ సెంటర్లు అభివృద్ధి పనులకు సహకరించిన షాప్ చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News