Saturday, July 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 'పది’లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు

Nandyala: ‘పది’లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు

''జగన్ అన్న ఆణిముత్యాలు-2023''

నంద్యాల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ లో ఈ సంవత్సరం ఉన్నతమైన మర్క్స్ సాధించిన విద్యార్థులకు సత్కారాలు స్థానిక గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించిన ”జగన్ అన్న ఆణిముత్యాలు-2023” కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి అందజేశారు.

- Advertisement -

నంద్యాల నియోజకవర్గంల పదవ తరగతి ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన ఏపి మోడల్ స్కూల్ విద్యార్థిని చాకలి రాజేశ్వరికి ఆర్థిక బహుమతి 15,000/-, రెండవ ర్యాంక్ హై స్కూల్ విద్యార్థి శేషు ఫణికి 10,000/-,మూడవ ర్యాంక్ దీబగుంట్ల విద్యార్థి గోస ప్రణయ్ కుమార్ కి 5000/- రూపాయలు అందజేశారు.

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కోడుమూరి పూజిత కు 15,000/-,రెండవ ర్యాంక్ ప్రభుత్వ జూనియర్ కలశాల విద్యార్థిని మౌనికకు 15,000/-,మూడవ ర్యాంక్ విద్యార్థిని షేక్ హుసేన బీ కు 15,000/- ఆర్థిక బహుమతి అందజేశారు.

ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ మాబునిస్స, డిఇఓ సుధాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News