నంద్యాల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ లో ఈ సంవత్సరం ఉన్నతమైన మర్క్స్ సాధించిన విద్యార్థులకు సత్కారాలు స్థానిక గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించిన ”జగన్ అన్న ఆణిముత్యాలు-2023” కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి అందజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/0731a6b7-0042-43df-8688-2b043a9aebbf-1024x628.jpg)
నంద్యాల నియోజకవర్గంల పదవ తరగతి ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన ఏపి మోడల్ స్కూల్ విద్యార్థిని చాకలి రాజేశ్వరికి ఆర్థిక బహుమతి 15,000/-, రెండవ ర్యాంక్ హై స్కూల్ విద్యార్థి శేషు ఫణికి 10,000/-,మూడవ ర్యాంక్ దీబగుంట్ల విద్యార్థి గోస ప్రణయ్ కుమార్ కి 5000/- రూపాయలు అందజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/64454579-1135-4a39-ab95-28ef44ac0a21-1024x768.jpg)
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కోడుమూరి పూజిత కు 15,000/-,రెండవ ర్యాంక్ ప్రభుత్వ జూనియర్ కలశాల విద్యార్థిని మౌనికకు 15,000/-,మూడవ ర్యాంక్ విద్యార్థిని షేక్ హుసేన బీ కు 15,000/- ఆర్థిక బహుమతి అందజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/d104d9e8-d251-4299-a2ac-2fb939cba71e-1024x768.jpg)
ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ మాబునిస్స, డిఇఓ సుధాకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/06/8f79a886-a5e2-4cd2-bbeb-88a3f1c2c457-1024x768.jpg)