Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: శిల్పా కుటుంబానికి భారీ షాక్

Nandyala: శిల్పా కుటుంబానికి భారీ షాక్

100 కుటుంబాలు టిడిపిలోకి

నంద్యాల 5 వార్డు టిడిపి ఇన్చార్జ్ అజీమ్ ఆధ్వర్యంలో శిల్పా ముఖ్య అనుచరుడు ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో టిడిపిలో చేరారు. నంద్యాల పట్టణం 5 వార్డ్ నడిగడ్డలో వైసిపి ఖాళీ అవుతుందని నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా 5 వార్డ్ నడిగడ్డ ఇంచార్జ్ అజీమ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు హాజీ వారితో పాటు 100 కుటుంబాలు నంద్యాల టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరినట్లు వారికి ఫిరోజ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ 5 వార్డులో వైసిపి ఖాళీ అయిపోతుందని ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల ఆకర్షితులై గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తించి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, వైఎస్ఆర్సిపి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికీ వైసీపీలో చేరరాన్నారు. కొందరు వైసీపీ నాయకులు యువకులకు డబ్బులు ప్రలోభ పెట్టి కండువాలు వేసినంత మాత్రాన యువకులలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని కొనలేరన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News