Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: సిద్ధం కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు

Pathikonda: సిద్ధం కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు

సిద్ధం అద్దంకి సభ లైవ్లో..

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్దంకిలో నిర్వహించే సిద్ధం బహిరంగ సభను వీక్షించేందుకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆదేశాల మేరకు ఎంపీపీ నారాయణ దాసు అధ్యక్షతన పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి నందు భారీ ఎల్ఈడి స్క్రీన్ తో ప్రేక్షకులు ప్రజలు బహిరంగ సభను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రేక్షకులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పత్తికొండ సచివాలయ మండల కన్వీనర్ మోహన్ కృష్ణ,మాజీ సర్పంచ్ సోమశేఖర్,నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News