Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్‌ భేటీ

Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్‌ భేటీ

Pawan Kalyan|ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఏపీలో జలజీవన్ మిషన్ అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర పథకాల పొడిగింపు వంటి కీలక అంశాలపై ప్రధానితో చర్చిచినట్లు సమాచారం.

- Advertisement -

కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టుల సాధనల గురించి చర్చించారు. పవన్ కలిసిన వారిలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పర్యాటక శాఖ మంత్రి గెజవత్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ(NDA) ఎంపీలకు పవన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad