Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Peapully: వైసీపీ వాళ్లని మేం ఆహ్వానించలేదు

Peapully: వైసీపీ వాళ్లని మేం ఆహ్వానించలేదు

మాపై కుట్ర జరుగుతోంది

తెలుగుదేశం పార్టీలోకి రమ్మని వైసీపీ నాయకులెవరినీ ఆహ్వానించ లేదని కానీ ప్రస్తుత వైసిపి నాయకులు మాత్రం ప్రెస్ మీట్ లు పెట్టి మరీ టిడిపిలోకి రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున అధిష్టానం డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా వారి గెలుపునకు శక్తి వంచన లేకుండా సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. కొంతమంది టిడిపి నాయకులు వైసీపీతో కుమ్మక్కై తమ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పత్రికల్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కొంతమంది టిడిపి నాయకులు వైసిపికి కోవర్టులుగా మారి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని, అలాంటి వారికి పట్టం కడితే సహకరించేది లేదని ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News