Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam borders: కర్ణాటకలో చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు

Mantralayam borders: కర్ణాటకలో చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు

పార్టీ కుటుంబ సభ్యులంతా అండగా ఉంటామన్న మాన్వి ప్రజలు

నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా మాన్వి నియోజకవర్గంలో బాబు అభిమానులు నిరాహార దీక్షలు చేపట్టారు.. చంద్రబాబు అభిమానులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మంత్రాలయం ఇంచార్జ్ తిక్కారెడ్డి. ఆలూరు నియోజకవర్గం ఇన్ చార్జ్ సుజాతమ్మ , మాన్వి ఎమ్మెల్యే అంపయ్య నాయక్ మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ తదితరులు పాల్గొని చంద్రబాబు మద్దతుగా నిరసన తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ’ మంత్రాలయం టిడిపి ఇన్చార్జి తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ఈరోజు దేశం మొత్తం చూస్తుందని, అలాంటి నాయకున్ని కేవలం రాజకీయ కక్ష కారణంగా వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు.. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారని, ఇరుగుపొరుగు రాష్ట్రాలలోనూ ప్రజలు నిరసనలు చేపట్టడం చంద్రబాబు గొప్పతనాన్ని తెలుపుతుందన్నారు.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News