Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏజీఎస్ మూర్తి ఎస్ఐగా పనిచేస్తున్నారు. అయితే ఆయనపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

- Advertisement -

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎస్సై మూర్తి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అనంతరం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ మూర్తి ఆత్మహత్యకు కారణాలు ఏంటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సస్పెండ్ చేయడంతోనే మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆత్మహత్యకు కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad