Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: ఆది దంపతులకు టీటీడీ తరుపున పట్టువస్త్రాలు

Srisailam: ఆది దంపతులకు టీటీడీ తరుపున పట్టువస్త్రాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఛైర్మన్ సతీమణి స్వర్ణలతా రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం దంపతులు, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న,చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలతా రెడ్డికి,జేఈవో వీరబ్రహ్మం దంపతులు శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి శ్రీస్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించగా, అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News