Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు

Srisailam: మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు

హెలిక్యాప్టర్ ద్వారా వచ్చి వెళ్లిన బాబు

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాదు నుంచి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు. దర్శనార్థం సుండిపెంటకు చేరుకున్న నారా చంద్రబాబు దంపతులకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఉమ్మడి జిల్లాల పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సుండిపెంట హైలిప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో చంద్రబాబు దంపతులు మొదటగా శ్రీసాక్షిగణపతి స్వామిని దర్శించుకొని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు…..

- Advertisement -

దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం ద్వజస్తంభానికి నమస్కరించి, శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని, మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు శేషవస్త్రాలు శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో సుండిపెంటకు వెళ్లి అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబాదుకు వెళ్లారు చంద్రబాబు దంపతులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News