Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం ఈఓ లవన్నను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్

Srisailam: శ్రీశైలం ఈఓ లవన్నను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్

శ్రీశైలం ఆలయంలో స్వామి భక్తి ప్రదర్శించిన ఈవో లవన్న మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. మల్లన్న స్వామిని మరిచిన ఈవో లవన్న వ్యక్తి ఆరాధకు పెద్ద పీట వేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదాలకు నమస్కరించారు. మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన లవన్న.. తాను శివస్వామి మాలదారణ విషయాన్ని సైతం పక్కనపెట్టి ఏకంగా మంత్రి పెద్దరెడ్డి కి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈవో లవన్న వ్యవహార శైలిని చూసి శివ భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీశైల దేవస్థానం ఈవో వ్యవహార శైలి ఉన్నందున ఆయనను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పలు వివాదాల్లో కేరాఫ్ అడ్రస్ గా ఉన్న లవన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా విఫలం కావడంతో ఆయనపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News