Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: బ్రహ్మోత్సవాలకు రావాలంటూ జగన్ కు ఆహ్వానం

Srisailam: బ్రహ్మోత్సవాలకు రావాలంటూ జగన్ కు ఆహ్వానం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందించారు శ్రీశైలం దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికను దేవస్థానం ఈవో ఎస్. లవన్నఅందజేశారు. శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 11 నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి. సీఎంకు శివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ , ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News