Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: స్వామి సన్నిధిలో సీజేఐ దంపతులు

Srisailam: స్వామి సన్నిధిలో సీజేఐ దంపతులు

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి మహామంగళహారతిలో పాల్గొన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దంపతులు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దంపతులు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేయగా మంత్రి ఆది మూలపు, కమిషనర్ హరి జవహర్ లాల్, ఈవో లవన్న, చైర్మన్, శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. చీఫ్ జస్టిస్ దంపతుల వెంట ఏపీ మంత్రి సురేష్,ఎమ్మెల్యే, ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని, ఎస్పీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News