Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP-Janasena: వైసిపిను సాగనంపుదాం

TDP-Janasena: వైసిపిను సాగనంపుదాం

టిడిపి-జనసేన ఉమ్మడి పోరాటం

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరిచి రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వైసిపి పాలనను గద్దె దింపడానికి టిడిపి జనసేన కలిసి ఉమ్మడి పోరాటాలు చేస్తాయని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, ఎమ్మిగనూరు జనసేన నాయకుడు చల్లా వరుణ్ అన్నారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో టిడిపి అధ్వర్యంలో 12 వ రోజు జరిగిన నిరాహార దీక్షలను బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. జనసేన నేత చల్లా వరుణ్ దీక్షకు మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసేన అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్న వైసిపిను ఇంటికి పంపేవరకు పోరాటాలు చేస్తాం. అభివృద్ధి సంక్షేమంను మరిచి ప్రతి పక్షాలపై కేసులతో భయపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, మిఠాయి నరసింహులు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, కటారి రాజేంద్ర, దామ నరసింహులు, బంద నవాజ్, శాబీర్, బోయ రంగన్న, నజీర్, అల్తాఫ్, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్, డీలర్ ఈరన్న, దాదా వలి, నాగేష్ ఆచారి, శిల్పి భాస్కర్, సలీం, సలాం, గౌస్, ఈశ్వర్, యు రవి, కృష్ణతేజ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News