తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజమేనని ఆవిడ ఆరోపించారు.
2018‑19 కాలంలో తెలంగాణ CM కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ CM గా వై ఎస్ జగన్ ఉన్నప్పుడు.. వారిద్దరూ కలిసి కుట్ర పన్ని నా, నా భర్త, నా ఇతర సన్నిహితుల ఫోన్లు టాప్ చేశారని సీరియస్ అయ్యారు. కేసీయార్ జగన్ మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. వాటి ముందు రక్త సంబంధాలు కూడా పనికి రావని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వారిద్దరూ కలిసే చేశారని మండి పడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ పూర్తి నిజమని, ఏ విచారణైనా ఎదుర్కొంటానని బైబిల్ మీద ప్రమాణం చేసి చేస్తానని షర్మిల అన్నారు. తాను ఏ విచారణను ఎదుర్కోవడానికయినా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి నేరుగా వారి ఇంటికి వచ్చి తన ఫోన్ సంభాషణల ఆడియోను తనకే ఆమెకే వినిపించించిన సందర్భాన్ని షర్మిల గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు జరుగుతున్న అరాచకాల ముందు ఫోన్ ట్యాపింగ్ అంశం నాకు చాలా చిన్నదిగా అనిపించడంతోనే ఆ సమయంలో నేను ఆ విషయాన్ని వదిలేశానని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఏపీ, విశాఖపట్నం జిల్లా పర్యటన సందర్భంగా షర్మిల హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లారు. ఆ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు.