Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్YSR Raithu Bharosa: వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా

YSR Raithu Bharosa: వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా

కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా

కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపి అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు పి.శివ ప్రసాద్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధిసంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ అమరేంద్ర కుమార్, ఏఎన్‌జిఆర్‌ఏయూ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎల్‌ ప్రశాంతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News