Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుDharmavaram Terrorist: ధర్మవరంలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్.. అసలు అతడి ప్లాన్ ఏంటంటే?

Dharmavaram Terrorist: ధర్మవరంలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్.. అసలు అతడి ప్లాన్ ఏంటంటే?

Dharmavaram Terrorist Arrest: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న నూర్ మహమ్మద్ షేక్ (40) అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది.

- Advertisement -

ధర్మవరం కోట ప్రాంతంలో హోటల్ లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్ నివాసంలో సోదాలు చేసి, NIA 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. జైషే మహమ్మద్ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వ్యాఖ్యలు చేసినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. స్థానిక పోలీసులు అతన్ని మొదట అదుపులోకి తీసుకుని, తర్వాత NIAకు అప్పగించారు.

ALSO READ: Ram Gopal Varma:వీధి కుక్కల వివాదంపై ఘాటుగా స్పందించిన వర్మ!

జైషే మహమ్మద్, 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ, భారత్‌పై దాడులు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 2001 భారత పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్, 2019 పుల్వామా దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది. ఐక్యరాజ్యసమితి మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. నూర్‌ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్న NIA, అతని కార్యకలాపాలు, సంబంధాలపై లోతైన దర్యాప్తు చేస్తోంది.

ఇదే సమయంలో, ఎర్రగుంటకు చెందిన రియాజ్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాతో సంబంధం ఉన్న కంటెంట్ అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ధర్మవరంలో కలకలం రేపింది. గతంలో అన్నమయ్య జిల్లాలో రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న అబుబక్కర్ సిద్దీక్, మహమ్మద్ అలీ (మన్సూర్) అనే ఉగ్రవాదులను తమిళనాడు ATS అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులు ఏపీలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఆందోళన కలిగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad