Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుశ్రీవారిని దర్శించుకోనున్న.. పవన్ కళ్యాణ్ సతీమణి..!

శ్రీవారిని దర్శించుకోనున్న.. పవన్ కళ్యాణ్ సతీమణి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆమె సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత సేవలో పాల్గొననుండగా, అనంతరం స్వామివారి దర్శనం తీసుకుని మొక్కులు చెల్లించనున్నారు. ఇటీవల సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడినందుకు భగవంతునికి కృతజ్ఞతగా ఈ మొక్కు చెల్లిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు ఈ యాత్ర నేపథ్యంలో, అనా కొణిదెల తిరుమలకు చేరిన వెంటనే టీటీడీ నిబంధనల మేరకు అతిథి గృహంలో డిక్లరేషన్ సమర్పించారు. ఆమె భక్తి శ్రద్ధలతో చేసే ఈ పర్యటన కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad