Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుRammurthy Naidu: ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకున్న రామ్మూర్తి నాయుడు పార్థివదేహం

Rammurthy Naidu: ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకున్న రామ్మూర్తి నాయుడు పార్థివదేహం

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రామ్మూర్తి భౌతికకాయాన్ని నారావారి పల్లెకు తరలించనున్నారు. మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారు.

- Advertisement -

మధ్యాహ్నం జరగనున్న తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. ఈ అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబసభ్యులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈనెల 14న హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad