Mahindra Scholarship 2025 : పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందించేందుకు కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మహీంద్రా అల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ (MAITS) 2025ని అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 1995 నుంచి ఈ కార్యక్రమం ద్వారా 12,940 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ ఏడాది 550 మందికి ఏటా రూ.10,000 చొప్పున, గరిష్ఠంగా మూడేళ్లు (రూ.30,000) అందజేస్తారు.
ALSO READ: Peddi Updates: రామ్ చరణ్ ‘పెద్ది’ ఆఫర్ తిరస్కరించిన మలయాళ నటి.. కారణమేమంటే!
ఎవరు అర్హులు?
• భారతీయ పౌరులై ఉండాలి.
• పదో తరగతి లేదా ఇంటర్లో 60% కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత.
• ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్లో మొదటి సంవత్సరం డిప్లొమా కోర్సులో చేరిన వారు.
• తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యం.
• విద్యార్థినులు, దివ్యాంగులు, సైనిక దళాల సిబ్బంది పిల్లలకు ప్రత్యేక పరిగణన.
అవసరమైన డాక్యుమెంట్లు:
• పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10వ/12వ తరగతి మార్కుల జాబితా, పాలిటెక్నిక్ ప్రవేశ రుజువు (అడ్మిషన్ లెటర్/ఫీజు రసీదు).
• రిఫరెన్స్ లేఖ, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్/క్యాన్సిల్డ్ చెక్.
• విద్యార్థి ఆసక్తులు, లక్ష్యాల గురించి స్టేట్మెంట్.
దరఖాస్తు విధానం:
• KCMET వెబ్సైట్ (www.kcmet.org)లోని MAITS సెక్షన్లో రిజిస్టర్ చేసుకోండి.
• ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్తో లాగిన్ అవ్వండి.
• అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
• తెలుగు రాష్ట్రాలకు గడువు: ఆగస్టు 27, 2025; ఇతర రాష్ట్రాలకు: ఆగస్టు 31, 2025.
సంప్రదింపు: సందేహాలకు [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
స్లగ్: mahindra-scholarship-2025-details


