Actress Varalakshmi: సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో మరో పెద్ద అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్లలో తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్న వరలక్ష్మి, ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా ప్రవేశించబోతున్నారు. ఇప్పుడీ వార్త నెట్టింట్లో హల్ చపిల్ చేస్తోంది.
హాలీవుడ్ ఎంట్రీ:
వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘పోదా పొడి’ సినిమాతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఆ తర్వాత విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. స్టార్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా పరిశ్రమలోకి వచ్చినా, తన సొంత ప్రతిభతో ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు కీలక పాత్రలతో పాటు లేడీ విలన్ పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, వరలక్ష్మి శరత్ కుమార్ ‘రిజానా: ఎ కేజ్డ్ బర్డ్’ (Rizana: A Caged Bird) అనే హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. వెటరన్ డైరెక్టర్ చంద్ర రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. వరలక్ష్మి హాలీవుడ్ ఎంట్రీపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో సాధిస్తున్న ఈ కొత్త విజయం ఆమె నటనకు, అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేయబోతున్నారో వేచి చూడాలి.