అక్కినేని అఖిల్ పెళ్లి వైవాహిక బంధంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 6న తెల్లవారుజామున హైదరాబాద్లో అతని ప్రేయసి జైనబ్ రవ్డ్జీతో వివాహం అయ్యింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో సాదాసీదాగా జరిగిన ఈ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్డ్జీ కుమార్తె.
పెళ్లి అనంతరం అఖిల్-జైనబ్ రిసెప్షన్ను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమవుతోంది. జూన్ 8న (ఆదివారం) సాయంత్రం 7.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియో అన్నెక్స్లో ఈ గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం.
ఇది కుటుంబంలో చివరి పెళ్లి కావడంతో నాగార్జున వ్యక్తిగతంగా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వేదికను రిచ్ లుక్లో తీర్చిదిద్దించడంతో పాటు ఫుడ్ మెనూలో ప్రత్యేక రుచులు ఉంచారట. పెళ్లి వేడుకకు వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా రిటర్న్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశారని తెలిసింది.
అఖిల్, జైనబ్ల ప్రేమ కథకు ఇది హ్యాపీ ఎండింగ్ లాంటిదే. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు తమ బంధాన్ని వివాహంగా మలిచారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్డ్జీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో భారీ స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేల కోట్ల టర్నోవర్ కలిగిన వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగిన కుటుంబంలో పెళ్లి చేయడం అఖిల్కు మరింత ప్రాధాన్యం చేకూర్చింది. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు సినీ, వ్యాపార రంగాల్లోని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.