Thursday, July 25, 2024
Homeచిత్ర ప్రభAllari Naresh: ఓటీటీలోకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఎప్పట్నుంచో తెలుసా??

Allari Naresh: ఓటీటీలోకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఎప్పట్నుంచో తెలుసా??

- Advertisement -

Allari Naresh : అల్లరి నరేష్ రూటు మార్చి అన్నీ కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తున్నాడు. నాంది భారీ విజయం సాధించిన అనంతరం ఇటీవలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు AR మోహన్ తెరకెక్కించాడు.

ఓటు విలువ చెప్పే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. నవంబర్ 25న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా థియేటర్స్ లో విడుదలైంది. సినిమా విడుదలయి నెల రోజుల తర్వాత ఒప్పందం ప్రకారం ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలోకి రానుంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా జీ5 ఓటీటీలో డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దీంతో సినిమాని థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో చూసేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News