అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పాన్-ఇండియా చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సమాచారం అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఫిల్మ్ సర్కిల్స్లో మాత్రం ఈ అంశంపై గాసిప్ నడుస్తోంది.
తాజా బజ్ ప్రకారం, దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్ కలిసి చిరంజీవిని ప్రత్యేక పాత్ర కోసం కలిసి ఒప్పించారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఈ సినిమా పాన్-ఇండియా రేంజ్ మరింత పెరిగి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు దారితీయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి హాజరయ్యే సీన్లు ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్గా మారతాయని, ఈ మూవీలో మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఆర్మీ మధ్య జరుగుతోన్న సోషల్ మీడియా వివాదాలకు పుల్స్టాప్ పడే అవకాశముందని టాక్.
అయితే, మెగాస్టార్ వాస్తవంగా ఈ ప్రాజెక్టులో భాగమవుతారా లేదా అన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకూ తేలాల్సిన విషయమే. కానీ ఇప్పటి వరకూ అందుతున్న సంకేతాల ప్రకారం ఇది భారీ మల్టీ స్టారర్గా తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది.