Vishnu Manchu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్లలోకి దూసుకొచ్చేస్తోంది! ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు, ఊహించని క్రేజ్ నెలకొన్నాయి. ఈ మూవీ కోసం దాదాపు పదేళ్లుగా వర్క్ చేశానని విష్ణు మంచు తెలిపారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయటంలో తన వంతు బాధ్యతను విష్ణు అండ్ టీమ్ సమర్ధవంతంగా పూర్తి చేసింది. ఇక లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కన్నప్ప టికెట్ ధరల (Kannappa Ticket Rates) పెంపునకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలోనూ అదనంగా రూ. 50 (జీఎస్టీ అదనం) పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ స్పెషల్ రేట్స్ సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. ఇది కన్నప్ప సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.
ముకేశ్ కుమార్సింగ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటించారు. ప్రభాస్ రుద్ర అనే పాత్రలో, మోహన్లాల్ కిరాతగా, అక్షయ్కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, మోహన్బాబు మహదేవ శాస్త్రిగా నటించారు. ఈ సినిమా శివుడి ఆదేశంతో, విష్ణుకు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిందని, సినిమా షూటింగ్ సమయంలో చెప్పలేనన్ని బాధలు ఎదుర్కొన్నామని విష్ణు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/actress-sreeleela-out-of-akhil-akkineni-lenin-movie/
నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కన్నప్పను అన్ని చట్టపరమైన అనుమతులతో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు, భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర్యాన్ని తాము గౌరవిస్తామని, కానీ సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చింది. కన్నప్పకు సంబంధించి మోహన్బాబు, మంచు విష్ణు వ్యక్తిత్వానికి, ప్రచార హక్కులకు ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని కూడా గుర్తుచేసింది.
వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి కన్నప్ప సినిమాను రూపొందించారు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో రీసెంట్గా ఆయన కార్యాలయాలపై జి.ఎస్.టి అధికారులు తనిఖీలు చేశారు. అయితే, ఈ జీఎస్టీ తనిఖీలపై మంచు విష్ణు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘‘మీరు చెప్పే వరకూ నాకు తెలియదు. అయినా దాచిపెట్టేదేమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’’ అంటూ ఆయన సరదాగా, బోల్డ్గా వ్యాఖ్యానించారు. విష్ణు ఇచ్చిన ఈ ‘ఫన్నీ కమ్ బోల్డ్’ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.