Chiranjeevi 47 Years Industry : మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయాన్ని తాకే పోస్ట్తో అభిమానులను ఆకట్టుకున్నారు.
ALSO READ: Sathya Sai district: వీఆర్వోతో గుంజీలు తీయించిన లేడీ ఆఫీసర్.. అసలేం జరిగిందంటే..?
1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’తో ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ మెగాస్టార్ చిరంజీవిగా మారారు. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్లు కీలక పాత్రలు పోషించారు. అయితే, చిరు మొదటి సినిమా ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ, ‘ప్రాణం ఖరీదు’ ముందు విడుదలైంది. ఈ 47 ఏళ్లలో 155 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి, తన జర్నీని అభిమానుల ప్రేమకు అంకితమిచ్చారు. “నన్ను అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, మెగాస్టార్గా ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా అవార్డులు, గౌరవాలు మీవే” అని ట్వీట్లో పేర్కొన్నారు.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సినీ జీవితం తెలుగు సినిమాకు ఓ బెంచ్మార్క్. 1980లలో ‘ఖైదీ’, ‘మంత్రి గారి వియ్యంకుడు’, 1990లలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, 2000లలో ‘ఇంద్ర’ వంటి బ్లాక్బస్టర్లతో ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2022లో ‘గాడ్ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలతో మళ్లీ యూత్ను ఆకర్షించారు. ఆయనకు పద్మ విభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డ్తో సహా ఎన్నో గౌరవాలు లభించాయి.
ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ కూడా 2026లో వస్తుంది. శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు చిత్రాలు లైన్లో ఉన్నాయి. ‘విశ్వంభర’ సామాజిక ఫాంటసీ జానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది, ఇందులో త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. చిరంజీవి సినీ జీవితం, అభిమానుల ప్రేమానుబంధం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు యువ నటులకు స్ఫూర్తి.


