Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభKaikala Satyanarayana : కైకాల మరణం పట్ల.. చిరంజీవి భావోద్వేగం

Kaikala Satyanarayana : కైకాల మరణం పట్ల.. చిరంజీవి భావోద్వేగం

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణించిన విషయం తెలిసిందే. కైకాల మరణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వోగానికి గురయ్యారు. ఆయనతో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి తాను ఎన్నో చిత్రాలలో నటించానని, ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు కలిగిందని అన్నారు. డైలాగ్ డెలివరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన పంథా అని చెప్పారు. కైకాల స్వచ్ఛమైన స్పటికంలాంటి వ్యక్తి అని, నిష్కల్మషమైన మనసున్న మనిషని కొనియాడారు. తనను తమ్ముడూ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారని, తమ మధ్య ఆత్మీయతానుగారాలు అంతకంతకూ బలపడుతూ వచ్చాయని అన్నారు. ఆయనతో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

ఆయనకు నటనతో పాటు రుచికరమైన భోజనం అన్నా ఇష్టమని చిరంజీవి తెలిపారు. తన శ్రీమతి సురేఖ చేతి వంటలంటే ఎంతో ఇష్టపడేవారని చెప్పారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం తనకు మిగిలిన సంతృప్తి పేర్కొన్నారు. ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంగా ‘అమ్మా సురేఖా, ఉప్పుచేప వండి పంపించు’ అని అన్నారని.. మీరు త్వరగా కోలుకోండి, ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దామని తాము చెప్పిన మాటల్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News