Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభRetro Movie: సూర్యను టార్గెట్ చేసిందెవరు!

Retro Movie: సూర్యను టార్గెట్ చేసిందెవరు!

Suriya – Karthik Subbaraju: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌కు సౌత్ ఇండస్ట్రీలో భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అటు త‌మిళం, ఇటు తెలుగు స‌హా ఇత‌ర సౌత్ భాష‌ల్లో సూర్య‌కు అసాధారణమైన క్రేజ్ ఉంది. సౌత్‌లో ప్రస్తుతం ఉన్న సీనియ‌ర్ హీరోల్లో సూర్యది పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఓ డిఫరెంట్ స్టైల్. సినిమా ఒప్పుకున్న తర్వాత అందులో పాత్ర కోసం సూర్య ఎంతగా హార్డ్ వ‌ర్క్ చేస్తారో ఆయా సినిమాలలోని పాత్రలు చూస్తే అర్థమవుతుంది. గజిని, 24, సింగం సిరీస్, సెవెంత్ సెన్స్..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నీ ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయి.

- Advertisement -

అయితే ఈ మధ్య సూర్య‌కు స‌రైన విజ‌యం ద‌క్క‌డం లేదు. శివ ద‌ర్శ‌క‌త్వంలో నటించిన పాన్ ఇండియ‌న్ సినిమా ‘కంగువ’ డిజాస్ట‌ర్ గా మిగిలింది. మరో టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సూర్య గత చిత్రం ‘రెట్రో’ ఫ్లాప‌వ్వ‌డం కూడా సూర్య ని బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే, సూర్య సినిమా రిలీజైన ప్ర‌తిసారీ సోష‌ల్ మీడియాల్లో అనవసరమైన నెగెటివిటీ జరుగుతోంది. ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సూర్య సతీమణి జ్యోతిక కూడా త‌న భ‌ర్త సూర్య న‌టించిన కంగువ పై నెగెటివ్ గా మాట్లాడింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-and-rashmika-movie-kubera-3-days-ww-collections/

తాజాగా దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజు కూడా రెట్రో సినిమా ఫ్లాప్ కావటానికి అసలు కార‌ణమే సోష‌ల్ మీడియాల్లో జరిగిన విషపూరిత ప్రచారం అని అన్నాడు. కొంద‌రు కావాల‌ని కుట్ర చేస్తున్నారు.. డబ్బులు తీసుకొని నెగిటివ్ గా ప్ర‌మోష‌న్స్ చేస్తూ హీరోలు, వారి సినిమాల‌ను చంపేస్తున్నారని తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కార్తీక్ సుబ్బ‌రాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. థియేట్రిక‌ల్ గా ఫ్లాపైనప్పటికీ రెట్రో సినిమా ఓటీటీలో మాత్రం మంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ సినిమా ఫస్టాఫ్ స‌హా యాక్ష‌న్ ఎపిసోడ్స్ విషయంలోనూ ప్ర‌శంస‌లు దక్కాయి.

అయితే, సుబ్బ‌రాజ్ చాలా ఎమోష‌న‌ల్ గా రియాక్ట్ అయ్యారు. రెట్రో మూవీ భారీ ఓపెనింగ్స్ తో మొదలైనా 50కోట్ల క్ల‌బ్ లో చేరేందుకు చాలా కష్టపడాల్సి వ‌చ్చింది. ఈ సినిమా వ‌సూళ్లు వేగంగా ప‌డిపోవ‌డానికి కార‌ణం సోషల్ మీడియాలో వచ్చిన త‌ప్పుడు రివ్యూస్ ని వైర‌ల్ చేయ‌డ‌మేనని కార్తీక్ సుబ్బరావు వాపోయాడు. ప్రతి హీరోకి ట్విట్టర్‌లో శత్రు శిబిరం ఉందని నేను విన్నాను. సినిమాల‌పై నెగిటివ్ న్యూస్ రాసేవాళ్ళకి డ‌బ్బులిచ్చే ఆఫీసులు ఉన్నాయ‌ని, ఇది గ్రూపుగా సాగే దందా అని కార్తీక్ సుబ్బ‌రాజు పేర్కొన్నారు. ఒక‌రి పరువు తీయడానికీ డ‌బ్బు చెల్లిస్తార‌ని ఈ సందర్భంగా తెలిపారు. నా సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చింది.. కానీ, నెగిటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయో తెలియక మేము అయోమయంలో పడ్డామని కార్తీక్ సుబ్బ‌రాజు అన్నారు. ఈ పెయిడ్ ప్రచారం ఎంతో ప్రమాదకరమైనది. చూస్తుంటేనే ఎంతో షాకింగ్‌గా అనిపిస్తుందని..కార్తీక్ సుబ్బ‌రాజు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News