Godavari Movie: గోదావరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నీతు చంద్ర, అప్పటి నుండి సాఫ్ట్ రోల్స్లో నటించి హోమ్లీ నటిగా గుర్తింపు పొందింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని సుమంత్, కమలినీ ముఖర్జీలతో కలిసి నటించిన ఈ సినిమాలో, సుమంత్కు మరదలిగా నటించిన నీతు చంద్ర పోషించిన పాత్ర పేరు రాజీ. ఈ రోల్ ఇప్పటికీ అనేక మంది ప్రేక్షకులకూ గుర్తుండిపోయేలా ముద్ర వేసింది. అందుకు కారణం..ఆమె నటనకు ప్రేక్షకులు విపరీతంగా స్పందించారు.
తెలుగులో ఇది ఆమె రెండో సినిమా కాగా, ముందు మంచు విష్ణు సరసన డెబ్యూ చేసింది. అలాగే డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన సత్యమేవ జయతే లో కథానాయికగా అలరించింది. తరువాత మనం చిత్రంలో కూడా మెమరబుల్ గెస్ట్ రోల్ చేసింది. బాలీవుడ్లోనూ నీతూ మంచి ఫేమ్ సంపాదించింది. బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహాం, మాధవన్ లాంటి స్టార్స్తో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించింది. తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో తన ప్రతిభను చాటిన ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ చివరిసారిగా 2021లో హాలీవుడ్ మూవీ నెవర్ బ్యాక్ డౌన్ రివోల్డ్ లో కనిపించింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/block-buster-sentiment-for-hari-hara-veera-mallu-release-date/
కేవలం నటనలోనే కాదు, నృత్యం మరియు క్రీడల్లోనూ నీతు యాక్టివ్గా ఉంటూ వచ్చింది. ఆమె క్లాసికల్ డాన్సర్గా ట్రెయిన్ అవ్వడమే కాకుండా, కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. 2018లో ప్రొ కబడ్డీ లీగ్కి చెందిన పాట్నా పైరేట్స్ టీమ్కు కమ్యూనిటీ అంబాసిడర్గా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంపై దృష్టి సారించి సినీ రంగానికి కొంత విరామం ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది.
తాజాగా నీతూ చంద్ర షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గోదావరి సినిమాలో నిత్య సొగసుతో కనిపించిన నీతూ, ఇప్పుడు మరింత గ్లామరస్ అవతారంలో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ‘‘ఇంత బొద్దుగా, గ్లామరస్గా మారిపోయిందేంటి!’’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.