Thursday, June 26, 2025
Homeచిత్ర ప్రభManchu Vishnu : విష్ణు మంచు ఆఫీసులో జి.ఎస్.టి అధికారుల తనిఖీ

Manchu Vishnu : విష్ణు మంచు ఆఫీసులో జి.ఎస్.టి అధికారుల తనిఖీ

Kannappa Movie : టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్! నటుడు మంచు విష్ణు కార్యాలయంపై జీఎస్టీ (GST) అధికారులు దాడులు నిర్వహించడం హాట్‌టాపిక్‌గా మారింది. జూన్ 27న క‌న్న‌ప్ప సినిమా రిలీజ్ ఉంది. ఇంకా రెండు రోజుల్లో రిలీజ్ కానున్నసంద‌ర్భంలో ఇప్పుడు జి.ఎస్‌.టి అధికారులు చెకింగ్‌కు రావ‌టం అనేది సినీ వ‌ర్గాల్లోనూ, సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మాదాపూర్‌లోని విష్ణు కార్యాలయానికి జీఎస్టీ అధికారులు వెళ్లి ఆయన జీఎస్టీ చెల్లింపుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. లెక్క ప్రకారం జీఎస్టీ చెల్లించారా, లేదా అనే దానిపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలు జరుగుతున్న సమయంలోనే సినీనటుడు, విష్ణు తండ్రి మోహన్‌బాబు కూడా కార్యాలయానికి చేరుకోవడం మరింత ఆసక్తిని రేపింది. జూన్ 27న ‘కన్నప్ప’ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రైడ్స్ జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

అయితే, ఈ జీఎస్టీ తనిఖీలపై మంచు విష్ణు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘‘మీరు చెప్పే వరకూ నాకు తెలియదు. అయినా దాచిపెట్టేదేమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’’ అంటూ ఆయన సరదాగా, బోల్డ్‌గా వ్యాఖ్యానించారు. విష్ణు ఇచ్చిన ఈ ‘ఫన్నీ కమ్ బోల్డ్’ స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rajamouli-new-strategy-for-superstar-mahesh-ssmb-29/

ఇక ‘కన్నప్ప’ సినిమా విషయానికి వస్తే, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్పగా డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రభాస్ (Prabhas), మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), మోహన్‌బాబు (Mohan Babu), కాజల్‌ (Kajal) వంటి స్టార్ కాస్ట్ ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ‘దేవుడు, భక్తుడు మధ్య జరిగే కథ ఇది. కన్నప్ప గురించి ఈతరానికి తెలియాలన్న ఉద్దేశంతో తెరకెక్కించాం’ అని విష్ణు స్వయంగా తెలిపారు.

హిందీ ఫైనల్ కాపీ చూసిన ప్రముఖులు ‘సినిమా ఆఖరిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి’ అని చెప్పారని, ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారని ఆశిస్తున్నానని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి, సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. అయితే, సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో, కన్నప్ప టీమ్ ఒక కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. నెగటివ్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీమ్ స్పష్టం చేసింది. మొత్తానికి, జీఎస్టీ రైడ్స్, విష్ణు బోల్డ్ రియాక్షన్, కన్నప్ప సినిమా హైప్… ఈ మూడు అంశాలు కలిసి టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ డిబేట్‌గా మారాయి. ‘కన్నప్ప’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ధమాకా సృష్టిస్తుందో చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News