Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Varun Tej: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్

Varun Tej: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్

Varun Tej| టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. వరుణ్‌తో పాటు చిత్రబృందం సభ్యులు కూడా ఉన్నారు. వీరికి ఆలయ ఈవో రామారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల చేత వేదాశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు. అంతకుముందు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని కూడా వరుణ్ దర్శించుకున్నారు.

- Advertisement -

కాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ మాట్లాడుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా గతంలో మనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్లను మరవను అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే మాట్లాడారంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad