Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభSSMB29: హాలీవుడ్ సినిమాగా మహేశ్ సినిమా..రూ. 50 కోట్లతో భారీ సెట్

SSMB29: హాలీవుడ్ సినిమాగా మహేశ్ సినిమా..రూ. 50 కోట్లతో భారీ సెట్

Superstar Mahesh: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే, బాహుబలి సిరీస్, ట్రిపులార్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. వేలమంది పాల్గొనే యాక్షన్ సన్నివేశాలు అందుకోసం ప్రత్యేకంగా నిర్మించే భారీ సెట్స్, సౌత్, బాలీవుడ్, హాలీవుడ్ నటీ నటులు..వీటన్నిటినీ మించి భారీ బడ్జెట్. అందుకే, మన తెలుగు సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ అంటున్నారు. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ తో ఓ పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

దుర్గ ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మూవీ ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే, హైదరాబాద్.. ఒడిశాలలో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసేందుకు అవుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-pan-india-movie-harihara-veeramallu-is-set-to-release-on-july-24/

ఈ కొత్త షెడ్యూల్ కోసం మూవీ టీమ్ కెన్యాకు వెళ్లనుందని తాజా సమాచారం. ఈ షెడ్యూల్ లో మెయిన్ క్యాస్టింగ్ పై జక్కన్న భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అంతకంటే ముందు భారీ సెట్ లో కీలక సన్నివేశాలను పూర్తి చేయనునంట్టు లేటెస్ట్ అప్‌డేట్. SSMB29 లో కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో ఉంటాయట. ఈ సీన్స్ షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. నిజానికి వారణాసిలో చిత్రీకరించాలనుకున్నప్పటికీ క్రౌడ్ కంట్రోల్ చేయలేమని భావించి మేకర్స్ సెట్స్ వేశారు.

ఈ చిత్రీకరణ పూర్తయ్యాకే, కెన్యా వెళ్తారని సమాచారం. అయితే కాశీ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ తీసేందుకు ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సెట్ కోసం దాదాపు రూ.50 కోట్లును ఖర్చు చేస్తున్నారట. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా అంతా షావుతున్నారు. ఇంత ఖర్చుతో సెట్టా.. అమ్మో ఇది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమానే అని మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి ఖచ్చితంగా పాన్ వరల్డ్ సినిమానే తీస్తున్నారని అని అంటున్నారు. ఇటీవల రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మేకర్స్ వేసిన సెట్ ని అందరూ వీక్షించి కొద్దిసేపు మరో లోకంలోకి వెళ్ళారు. ఇప్పుడు మహేశ్ మూవీ కొసం ఈ రేంజ్ సెట్ అంటే ఏ లోకంలోకి వెళ్ళి వస్తారో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News