జూనియర్ ఎన్టీఆర్(NTR) కొత్త సినిమా గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వరుస సినిమాలో బిజీగా ఉన్న తారక్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అది కూడా మైథలాజికల్ సినిమా అని చెబుతున్నారు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో ఓ పౌరాణిక సినిమా రావాల్సి ఉంది. అయితే బన్నీ తమిళ దర్శకుడు అట్లీ సినిమాకు కమిట్ కావడంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. దీంతో తారక్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
వాస్తవానికి త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్ని తొలుత తారక్తోనే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. గ్లోబల్ ప్రాజెక్టుగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది.
“నా మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్ఫుల్ గాడ్గా కనిపించనున్నారు” అంటూ పోస్ట్ చేశాడు. ఇందులో కుమారస్వామిపై ఓ శ్లోకాన్ని షేర్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ కార్తికేయ స్వామిగా నటించనున్నారనే హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుమారస్వామి కథను ఆధారంగా చేసుకుని గ్లోబెల్ లెవెల్ మైథలాజికల్ ప్రాజెక్ట్ను త్రివిక్రమ్ డెవలప్ చేశారని సమాచారం. అందులోనూ పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఇమిడిపోతారు. గతంలో యమదొంగ చిత్రంలో యముడి పాత్రలో ఒదిగిపోయాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఇప్పటికే ‘వార్ 2’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశాడు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ తన పాత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మొత్తానికి తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
NTR: కుమారస్వామి పాత్రలో ఎన్టీఆర్.. నాగవంశీ ట్వీట్ వైరల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES