Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభKrithi Sanon : ఆదిపురుష్ ఎందుకు లేట్ అవుతుందంటే..

Krithi Sanon : ఆదిపురుష్ ఎందుకు లేట్ అవుతుందంటే..

- Advertisement -

Krithi Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని రాముడిగా చూపిస్తానంటూ, రామాయణం ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తున్నానంటూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా వర్క్ అయిపోయింది. ఇందులో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఇటీవల ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేయగా అది చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. రామాయణం తీస్తానని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక హిందువులు అంతా ఇందులో రావణాసురుడిని ముస్లింగా చూపించారని, అసలు రామాయణం పోలికలు ఒక్కటి కూడా లేదని, హాలీవుడ్ సినిమాలాగా చూపిస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే సినిమా రిలీజ్ చేస్తే భారీ నష్టం తప్పదని అర్థమయి మళ్ళీ గ్రాఫిక్స్ ని సరిదిద్దే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. దీంతో ఆదిపురుష్ సినిమాని సంక్రాంతి రేస్ నుంచి తప్పించి జూన్ కి వాయిదా వేశారు.

తాజాగా ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ తన కొత్త సినిమా తోడేలు ప్రమోషన్స్ కి హైదరాబాద్ కి వచ్చింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కృతి ఆదిపురుష్ గురించి మాట్లాడింది. కృతి సనన్ మాట్లాడుతూ.. ”ఆదిపురుష్ సినిమాలో మేము నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మీరు సినిమాలో చూసింది కేవలం 30 సెకండ్లు మాత్రమే. అది చూసి సినిమా మొత్తం చెప్పేయలేము. ఆదిపురుష్ లో చెప్పాల్సింది చాలా ఉంది. అందులో మన చరిత్రని, ఇతిహాసాన్ని అద్భుతంగా చూపించబోతున్నారు ఓం రౌత్. ఈ సినిమాని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు టైం పడుతుంది. అందుకే సినిమా మరింత ఆలస్యం అవుతుంది” అని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News