Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభSharukh Khan : పఠాన్ సినిమాని నీ కూతురితో కలిసి చూడగలవా? సవాల్ విసిరిన మధ్యప్రదేశ్...

Sharukh Khan : పఠాన్ సినిమాని నీ కూతురితో కలిసి చూడగలవా? సవాల్ విసిరిన మధ్యప్రదేశ్ స్పీకర్..

- Advertisement -

Sharukh Khan : దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ప్రేక్షకుల ముందుకి పఠాన్ సినిమాతో రాబోతున్నాడు. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సినిమా పఠాన్ జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి ‘బేషరం రంగ్‌’ అనే రొమాంటిక్ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో దీపికా హద్దులు మీరి ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇక షారుఖ్ కూడా దీపికతో రొమాన్స్ చేశాడు. ఈ పాటలో దీపికా డ్యాన్స్, ఎక్స్‌పోజింగ్ కొంచెం అభ్యంతరకరంగా ఉండటంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ పాటని విమర్శిస్తున్నారు. ఆ పాట మార్చకపోతే సినిమాని కూడా రిలీజ్ చేయనివ్వం అంటూ సవాళ్ళు విసురుతున్నారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో బ్యాన్ పఠాన్ అని ట్రెండ్ చేస్తున్నారు.

తాజాగా ఈ పాటని విమర్శిస్తూ మధ్యప్రదేశ్ స్పీకర్ గిరీష్ గౌతమ్ కామెంట్స్ చేశారు. ఆ పాటని సినిమాలోంచి తొలగించాలని, ఇలాంటి పాటలు ఉన్న సినిమాని షారుఖ్ తన కూతురుతో కలిసి చూడగలడా, తన కూతురితో కలిసి ఈ సినిమాని చూస్తున్నట్టు అందరికి తెలిసేలా పోస్ట్ పెట్టాలని సవాల్ విసిరాడు. హిందూ మనోభావాలకు ఈ పాట విరుద్ధంగా ఉంది, ఇలాంటి పాటని ప్రవక్త మీద తీయగలవా అంటూ ప్రశ్నించాడు. దీంతో మధ్యప్రదేశ్ స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి ఒక్క పాటతో పఠాన్ సినిమా వివాదాల్లో మునిగినా ఫ్రీ పబ్లిసిటీ మాత్రం బాగానే వస్తుంది. మరి సినిమా రిలీజ్ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News