Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభManchu Lakshmi: నాతో దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మీ ఆగ్రహం

Manchu Lakshmi: నాతో దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మీ ఆగ్రహం

ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన సమయంలో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తన పట్ల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘‘నా లగేజ్‌ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్‌ ఓపెన్‌ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదు. ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇలాగేనా ఎయిర్‌లైన్స్‌ను నడిపేది. నాతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇకపై ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటాను’’ అని ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad