Friday, June 13, 2025
Homeచిత్ర ప్రభKannappa: గుజారాత్ విమాన ప్రమాదం.. మంచు విష్ణు కీలక ప్రకటన

Kannappa: గుజారాత్ విమాన ప్రమాదం.. మంచు విష్ణు కీలక ప్రకటన

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రమాదంపై మంచు విష్ణు(Manchu Vishnu) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘కన్నప్ప'(Kannappa) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

“ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్‌ రిలీజ్‌ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్‌లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని తెలిపారు.

ఇక ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాట‌లు, పోస్ట‌ర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News