Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభNaga Chaitanya: హిట్ డైరెక్ట‌ర్‌ని రిపీట్ చేస్తోన్న నాగ చైత‌న్య‌

Naga Chaitanya: హిట్ డైరెక్ట‌ర్‌ని రిపీట్ చేస్తోన్న నాగ చైత‌న్య‌

Director Shiva Nirvana: యంగ్ హీరో నాగచైతన్య అక్కినేని ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఓ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ చైతన్య‌ కెరీర్‌లో 24వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే అక్కినేని క‌థానాయ‌కుడు తన 25వ చిత్రానికి సైతం సన్నాహాలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు. ఇదివరకు నాగచైతన్య, శివ నిర్వాణల కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలీ’ చిత్రం మంచి విజయం సాధించింది. చైత‌న్య కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మ‌జిలీ నిలిచింది.

- Advertisement -

శివ నిర్వాణ త‌దుప‌రి సినిమాను నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి ‘టక్ జగదీష్’ మూవీ చేశాడు. అయితే ఆ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఆ త‌ర్వాత ఈ డైరెక్ట‌ర్ మ‌రో సినిమాను చేయ‌లేదు. మ‌రో మంచి క‌థ‌ను సిద్ధం చేసుకుని మళ్లీ మెప్పించే కథ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజా ప్రాజెక్ట్‌కి కూడా ఫీల్ గుడ్ ఎమోషన్‌తో పాటు కొద్దిపాటి యాక్షన్‌ను మేళవించి కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. చిత్ర పరిశ్రమ వర్గాల ప్రకారం, శివ చెప్పిన కథ చైతన్యకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఈ కాంబినేషన్‌పై చర్చలు జరుగుతున్నాయి. చివరకు 25వ చిత్రంగా ఈ కథను మొదలుపెట్టాలని నిర్ణయించారు. నాగ చైత‌న్య హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే హీరో, దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం శివ నిర్వాణ డైలాగ్ వెర్షన్‌పై పని చేస్తున్నారని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/will-jr-ntr-yamadonga-august-month-sentiment-continue-for-war-2/

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య చేస్తోన్న 24వ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ మూవీని విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్ దండుతో చైతన్య చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ అని తెలిసింది. ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. విరూపాక్ష త‌ర‌హాలోనే కార్తీక్ దండు తన రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి, ఇప్పటికే అక్కడ కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. చైతన్య గత చిత్రం తండేల్‌.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంతో తో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు చైత‌న్య‌. ఇప్పుడు వృష‌క‌ర్మ‌పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News