Naga Chaitanya: టాలీవుడ్లో రూపొందాల్సిన ఓ సంచలనాత్మక ప్రాజెక్ట్లో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్లో హీరో ఎవరో కాదు.. అక్కినేని నాగ చైతన్య. అయితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా నుండి నాగ చైతన్య అకస్మాత్తుగా తప్పుకున్నారు అనేది సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్త. నిజంగా ఈ వార్త ఆయన అక్కినేని అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ న్యూస్ టాలీఉవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ, నెటిజన్లలో చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే,
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా డెబ్యూ డైరెక్టర్ కిషోర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందాల్సి ఉంది. నిన్న మొన్నటి వరకు స్క్రిప్ట్ వర్క్ జరిగింది. అయితే ఫైనల్ ఔట్పుట్ విషయంలో చైతన్య శాటిస్ఫై కాలేదని అందువల్ల ప్రాజెక్ట్కు నో చెప్పేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పడదే సినిమా మరో యంగ్ హీరో చేతికి వెళ్లినట్లు కూడా సమాచారం. ఆ హీరో ఎవరో కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. నిజానికి ఇదొక ట్విస్ట్ అని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ రూపొందటానికి చాలా పెద్ద కసరత్తే జరిగింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంది. ALSO READ: https://teluguprabha.net/cinema-news/prashanth-neel-planning-to-do-a-movie-with-allu-arjun/
‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఓ ప్లానింగ్తో ముందుకెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం చాలానే వర్క్ చేశారు. అయితే ఇంత బ్యాకప్ ఉన్నప్పటికీ ఈ మూవీ నుంచి నాగ చైతన్య అకస్మాత్తుగా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చైతు ఇలాంటి షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడనే కారణం తెలియటం లేదు.
తాజాగా ఈ ప్రాజెక్ట్లో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, నాగ చైతన్య తప్పుకున్న వెంటనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని మేకర్స్ సంప్రదించారు. ఆయన వెంటనే సినిమాలో నటించటానికి ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కిషోర్ను కలిసిన రామ్కి ఆయన చెప్పిన స్టోరీ లైన్ యూనిక్గా అనిపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం, ఈ సినిమాకు సంబంధించి తుది చర్చలు జరుగుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసమే ఫుల్ ఫోకస్తో పనిచేస్తున్నాడు. రామ్, కిషోర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందనని అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.